హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. కొత్త సచివాలయం నిర్మాణం, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, నీరా కేఫ్ ప్రారంభం, అమరవీరుల స్మారక చిహ్నం తదితర వాటితో హుస్సేన్ సాగర్ కొత్త రూపు సంతరించుకుంది.
ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడంతో మరి సురేశ్ బాబు, రానా హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో అధికారులు స్పీడు పెంచారు. వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ YSRCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
ఈనెల 17వ తేదీన తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
కొంత ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే హైదరాబాద్ కే మంచి పేరు. కొన్నింటి కోసం కొన్ని తిప్పలు తప్పవంటూ కొందరు ఈ రేసును ఆహ్వానిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రపంచ క్రీడ సంబరానికి వేదికగా నిలుస్తుండడంతో హైదరాబాద్ వాసులు భారీ స్వాగతం పలుకుతున్నారు.
ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి అన్నారు. వాటి పరిష్కారం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ధరిణితో సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ప్రభుత్వానికి సవాల్ చేశారు. లేదంటే మీరు ఏం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణల పైన స్పందించారు సింగర్ యశస్వి కొండేపూడి(Yasaswi Kondepudi). నవసేనకు, అక్కడి పిల్లలకు సాయం చేస్తున్నానని లేదా వారిని దత్తత తీసుకున్నానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతల నేపథ్యంలో మరోసారి బషీర్ బాగ్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమక్షంలో వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కాం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ఖమ్మంలోనూ ఇటీవల వందే భారత్ రైలుపై దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ముగ్గురు యువకులు కావాలని రైలుపై రాళ్లు రువ్వారు. రైలు ప్రారంభం కాకముందే వైజాగ్ లో ఆగి ఉన్న రైలుపై కొందరు యువకులు రాళ్లు విసిరారు
సీఎం కేసీఆర్, కేటీఆర్ పై మరోసారి పొగిడిందే పొగిడాడు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) స్థాపనతో కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతాడని, ఇక కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని జోష్యం చెప్పాడు. రాముడు అంటే రామారావు.. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామజ్యం అనేది విన్నాం.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం.
వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో అతడితో పాటు మరో 40 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడమే కాదు
ఎక్కడెక్కడ ఉన్నాయో ముందే తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్ లో భూకంపం మాదిరి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఘటనలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో 2013-14 బడ్జెట్ ను చూసుకుంటే.. ఆ బడ్జెట్ లో ఉమ్మడి ఏపీలో చేనేత, జౌళీ శాఖకు కేటాయించింది రూ.70 కోట్లు. కానీ.. ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత, జౌళీ శాఖకు...
బారికేడ్లను తోసేసి వాహనదారులు ట్రాక్ పైకి వచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ట్రాక్ పైకి ఇతర వాహనాలు రావడంతో రేసింగ్ ప్రాక్టీస్ ను వాయిదా వేశారు. ట్రాక్ పై సెక్యూరిటీ లోపం ఉండటంతో...
రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీలో జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యామ్నాయ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు పలికారు.