• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వనపర్తిలో యువకుడు అదృశ్యం

వనపర్తి పీర్లగుట్టకు చెందిన మొగిలి రవి (25) మేస్త్రి పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈనెల 9న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల వద్ద వెతికిన ఫలితం లేకపోవడంతో తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.

October 13, 2025 / 04:29 AM IST

వనపర్తిలో వ్యక్తి అదృశ్యం

వనపర్తిలో వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. శాంతినగర్ కాలనీకి చెందిన మహేష్ (42) హమాలి పని చేస్తూ జీవనం సాగించేవారు. ఈనెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చేసిన అన్వేషణ ఫలించకపోవడంతో భార్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.

October 13, 2025 / 04:26 AM IST

వనపర్తి డీసీసీ చైర్మన్ పదవికి హోరాహోరీ

WNP: వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవికి హోరాహోరీ పోటీ నెలకొంది. ఈనెల 14న పార్టీ అబ్జర్వర్ రానుండటంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గాలు పదవిని సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, లక్కాకుల సతీష్, శంకర్ నాయక్, తిరుపతయ్య పోటీలో ఉన్నారు.

October 13, 2025 / 04:20 AM IST

రేపటి నుంచి ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ

SRD: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ శిక్షణకు కేటాయించిన కేంద్రాలలో జిల్లా ఉపాధ్యాయులందరూ తప్పక హాజరు కావాలని ఆయన సూచించారు.

October 13, 2025 / 04:15 AM IST

కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు: హరిశ్ రావు

SDPT: MLA హరిశ్ రావు కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఆదివారం సిద్దిపేటలో 297 మందికి రూ.60లక్షల CM సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలు రాలేదని ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా అయ్యాయని కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్స్ బంద్ చేశారని విమర్శించారు.

October 13, 2025 / 04:12 AM IST

స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది: రాణా

WGL: నల్లబెల్లి (M) నందిగామలో ఆదివారం BJP మండల అధ్యక్షుడు వినయ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా BJP జిల్లా ప్రధాన కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల విషయంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.

October 12, 2025 / 09:21 PM IST

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ గాయాలు

SRD: ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులో 161వ జాతీయ రహదారి వంతెన సమీపంలో లారీ బోల్తా పడింది. సంగారెడ్డి నుంచి నాందేడ్ వెళ్తున్న అరటి పండ్ల లారీ ఆదివారం ప్రమాదమశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పవన్ వికారికి స్వల్ప గాయాలు కాగా క్లీనర్‌కు ప్రమాదం తప్పింది.

October 12, 2025 / 09:12 PM IST

పేదోళ్ల జోలికి వస్తే సహించం: జూలకంటి

NLG: నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు MLGలోని తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీలలో ఆయన పర్యటించారు. వీధి వీధినా తిరుగుతూ పేద ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా పరిశీలించారు. పేదోళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

October 12, 2025 / 08:58 PM IST

పీడీఎస్‌ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టివేత

NZB: నవీపేట్‌లో అక్రమ పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వెహికల్ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా, అందులో NZB నుంచి ధర్మాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 25 సంచుల రేషన్ బియ్యం గుర్తించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సివిల్ సప్లై అధికారులకు అప్పగించామన్నారు.

October 12, 2025 / 08:57 PM IST

‘నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసిన నిందితుడు అరెస్ట్’

ADB: నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదివారం తెలిపారు. నిందితుడు, అతనికి సహకరించిన రియాల్టీ ముఠా ఈడీ ఆధీనంలో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసినట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయమై అక్టోబర్ 10 తేదీన ఫిర్యాదుదారుడు దుమ్మటి సూర్య రామకృష్ణ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

October 12, 2025 / 08:54 PM IST

ప్రమాద బాధిత కుటుంబానికి చేయూత

NLG: నల్గొండ పెద్ద బండకి చెందిన యువకుడు జక్కల మల్లేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు మునీర్ అహ్మద్ షరీఫ్ ఆదివారం మల్లేష్ నాయనమ్మను పరామర్శించారు. ఆయన మల్లేష్ కుటుంబానికి రూ.10 వేల నగదుతో పాటు 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో సలీం, నరసింహ, కృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

October 12, 2025 / 08:49 PM IST

ఆర్టీసీ ఉద్యోగుల బీసీ కమిటీ ఎన్నిక

KMR: బాన్సువాడ డిపో ఆర్టీసీ ఉద్యోగుల బీసీ కమిటీని ఆదివారం శివశక్తి గణేష్ మండపం వద్ద ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోపాల్, అంబాజీ, అధ్యక్షుడిగా లక్ష్మణ్, కార్యదర్శిగా తులసి రామ్, మారుతి, క్యాషియర్‌గా శివ రతన్, న్యాయ సలహాదారులుగా బసంత్, శంకర్ గౌడ్, శంకర్, ముఖ్య సలహాదారులుగా గిరిధర్, మల్లయ్య, రవీందర్ గౌడ్లను ఎన్నుకున్నారు.

October 12, 2025 / 08:49 PM IST

యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య

ADB: నేరడిగొండ మండలంలోని వడూరు గ్రామానికి చెందిన కడారి వినోద్ (23) మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లమని మందలించడంతో మనస్తాపానికి గురైన వినోద్ పంట పొలానికి వెళ్లి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

October 12, 2025 / 08:48 PM IST

పటాన్ చెరులో యువతి అదృశ్యం

SRD: పటాన్ చెరు పోలీస్టేషన్ పరిధిలో ముదిరాజ్ బస్తీకి చెందిన సబావత్ పింకి బాయి (23) అనే యువతి అదృశ్యమైంది. డిగ్రీ పూర్తి చేసిన పింకి బాయి ఆదివారం కిరాణా షాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోదరుడు సబావత్ వాసుదేవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

October 12, 2025 / 08:44 PM IST

ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

NRPT: మక్తల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. సుమారు రూ.42 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. మక్తల్ నియోజకవర్గ ప్రజలకు త్వరలోనే ఈ ఆసుపత్రి అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు.

October 12, 2025 / 08:42 PM IST