BHPL: గత నెలలో నిర్వహించిన TCC లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షల్లో మహదేవపూర్ ZPHS ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఏడుగురు విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. చదువుతో పాటు కళాత్మక రంగాల్లో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు.
PDPL: గోదావరిఖని డిపో నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్రను ఈనెల 8న ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, కాంచీపురం, జోగులాంబ దర్శనాలు కల్పిస్తారు. 15న తిరుగు ప్రయాణం. టికెట్ ధర రూ.10,000. వివరాలకు 7382847596ను సంప్రదించాలని సూచించారు.
MNCL: పాత గోడ కూలి వ్యక్తి గాయపడిన సంఘటన లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లిలో జరిగిందని 108 టెక్నీషియన్ మునిందర్ గౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన నాయనాల రాజయ్య బుధవారం పశువుల కొట్టం ప్రహరీ గోడ వద్ద పనిచేస్తుండగా గోడ కూలిపోయింది. దీంతో రాజయ్య కాలుకు తీవ్ర గాయమైంది.108 సిబ్బంది టెక్నిషియన్ మునిందర్ గౌడ్, పైలట్ శ్రీనివాస్ చేరుకుని ఆస్పత్రికి తరలించారు.
గద్వాల మున్సిపాలిటీలో 14వ వార్డు (గంజిపేట) సమస్యలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని బీఆర్ఎస్ నేత రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వార్డులో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా.. బాత్రూమ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొని అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ADB: తలమడుగు మండలంలోని పల్సి (బి) తాండ గ్రామానికి చెందిన రాథోడ్ నరేందర్ భార్య అశ్విని ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరి వెంట మండల BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BDK: మణుగూరు మండలానికి చెందిన 14 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. పేదలకు గృహ వసతి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ పథకం అమలవుతోందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లభించడం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు స్థిర నివాసం కలగడంతో పాటు జీవన స్థితి మెరుగుపడుతుంది అని అన్నారు.
KMM: మధిర బంజారా కాలనీలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం లక్ష్మీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజారులు ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు చేశారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
JN: చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలో ఇటీవల జరిగిన GP ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా గెలిచిన దివ్యాంగురాలు తిరుపతమ్మను ఇవాళ కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నపెండ్యాల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేశ్వర్లు ఉన్నారు.
KNR:హోళీ పండుగను పురస్కరించుకుని రేపు జమ్మికుంట మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయబడతాయని, తిరిగి బుధవారం నుంచి యథావిధిగా మార్కెట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించగలరు.
WGL పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.21వేలు ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.34 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,050, దీపిక మిర్చి రూ.29,500 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
BHNG: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో భువనగిరి-చిట్యాల రహదారి ప్రక్కన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటపొలాలకు సరిగ్గా యూరియా సరఫరా చేయడం లేదంటూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డీమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
HYD: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతిని శాసనసభ భవనంలోని లాంజ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.
కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం మాలోత్ సంగ్యనాయక్ తండాలోని తుల్జా భవాని, దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని మార్చి 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ, హోమాలు, ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. కావున భక్తులు భారీగా తరలి రావాలని కోరారు.
WGL: వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన సతీష్ గుండె పోటుతో మృతి చెందాడు. గ్రామంలో టెంట్ సామాను తీసుకు వస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలడంతో స్థానికులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బీజేపీలో గత కొన్నేళ్లుగా చురుగ్గా పని చేస్తూ సేవలు అందిస్తున్నారు.
RR: అందరూ ఆరోగ్యంగా జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. SDNR కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వాతిరెడ్డి వైద్యశిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు 6 మాసాలకు ఒకసారి తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.