NLG: తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (CITU) 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ కోరారు. సోమవారం దొడ్డి కొమరయ్య భవనంలో కార్మికులతో కలిసి ఆయన మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. అక్టోబర్ 26, 27 తేదీలలో ఇబ్రహీంపట్నంలో జరగనున్న ఈ రెండు రోజుల మహాసభల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.