PDPL: ఆర్టీఎం ట్రాఫిక్ పోలీసులు గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 11మందిని సోమవారం జీడీకే సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరిచారు. 11 మందికి కలిపి మొత్తం రూ.20 వేల జరిమానా విధించారు. వీరిలో రెండోసారి పట్టుబడిన ఆటో డ్రైవర్కు 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వర రావు తెలిపారు.