ATP: ఉరవకొండ పట్టణ శివారులో ఓ ఇంట్లో అక్రమంగా డంప్ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తహసీల్దార్ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.