కృష్ణా: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు అడ్డరోడ్డు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.