NRPT: జిల్లాలో చేప పిల్లలు, రొయ్యల పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. పలు జిల్లాలు పంపిణీలో వెనుకబడి ఉన్నాయని, దీనిని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.