E.G: జిల్లాలో మరో ప్రాజెక్ట్కు రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. రూ. 94 కోట్లతో చేపడుతున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పూర్తయ్యేలోగా నదిలో హౌస్ బోట్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. రాజమండ్రి పుష్కరాల రేవు, సరస్వతీ ఘాట్, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో 3 హౌస్ బోట్స్, 4 జలక్రీడల బోట్స్ రానున్నాయి. గోదావరిలో మూడుచోట్ల హౌస్ బోట్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది.