VSP: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగం చేస్తున్నవారికోసం సాయంత్రం వేళల్లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. బీటెక్ పూర్తి చేసి, స్థానికంగా ఉద్యోగం చేస్తున్నవారు ఈ కోర్సుకు అర్హులు. ఏయూ వీసీ రాజశేఖర్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, కోర్సులో సీటు పొందినవారు ఫీజు చెల్లించాలి. పరీక్షలకు అర్హత సాధించాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి.