SKLM: శ్రీకాకుళంలోని కమలనివాస్ వీధికి చెందిన పేర్ల. రమేష్ (63) మంగళవారం ఉదయం మృతి చెందారు. వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు విషయాన్ని తెలియజేసారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ-టెక్నీషియన్, పూతి .సుజాత, పి. సుమతి ల ద్వారా ఆయన కార్నియాలు సేకరించారు.