CTR: ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఈనెల 12న నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ ఎన్నికల అధికారి మురళి తెలిపారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర కమిటీ తరఫున పెంచలయ్య, మల్లేశ్వరరెడ్డి పరిశీలకులుగా వ్యవహరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.