MDK: నేషనల్ మీన్స్- కమ్- మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు ఈనెల 14వ తేదీ వరకు పెంచినట్లు మెదక్ డీఈవో రాధా కిషన్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.bse.telangana.gov.inలో చేసుకోవాలని సూచించారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.