SRCL: చందుర్తి మండల కేంద్రం నుంచి గోవిందారం వెళ్లే రహదారిపై ధాన్యం ఆరబోసి, బండరాళ్లు, కట్టెలను అడ్డుగా ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళ ఏ మాత్రం ఏమరపాటుగా వెళ్లినా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. మరోవైపు ధాన్యం ఆరబెట్టేందుకు ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.