MNCL: జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, రైతులు అవసరం మేరకు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా సక్రమంగా వినియోగించుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, ప్రతీ రైతుకు యూరియా అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.