W.G: ఈ నెల 10న భీమవరంలో ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి ప్రియ ఆధ్వర్యంలో ‘పింఛన్ అదాలత్’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జేసి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నారు.