VZM: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా కోట ఎదురుగా బొంకులదిబ్బ వద్ద సోమవారం రాత్రి ప్రదర్శించిన మోహినీ భస్మాసుర నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నాటకాన్ని ప్రేక్షకులు కదలకుండా చూశారు. అంతరించిపోతున్న నాటకాలు పండగ నేపథ్యంలో మళ్ళీ జీవం పోశారని ప్రేక్షకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గనుల శాఖ ఉప సంచాలకులు సిహెచ్ సూర్య చంద్రరావు పర్యవేక్షించారు.