KMM: కామేపల్లి మండలంలోని మద్దులపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ చందన తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఖమ్మం వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవలన్నారు.