ADB: ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహిమూద్ సోదరుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం మధ్యాహ్నం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
BHNG: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, మందుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
SRPT: నడిగూడెం మండలం రత్నవరం MPPS పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ (LKG, UKG) తరగతులను నేడు మండల విద్యాధికారి సత్యనారాయణ, సర్పంచ్ నాగేశ్వరరావు ప్రారంభించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆట వస్తువులను, తరగతి గదులను వారు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు.
ADB: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీపాద రావు సేవలు మరువలేనివని కొనియాడారు.
KMM: ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. పదవ తరగతి చదివే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మోటివేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
HNK: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించబోయే ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. మార్చి 29వ తేదీన ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పూర్వ విద్యార్థుల సంఘం నేతలు తెలిపారు.
BDK: ఇల్లందులోని రద్దీ ప్రాంతమైన జగదంబ సెంటర్లో గల సులభ్ కాంప్లెక్స్ సకాలంలో తెరవకపోవడంపై మున్సిపల్ ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ మూసి ఉండటంతో మహిళలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆమె తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణీత సమయానికి ప్రారంభించాలని ఆదేశించారు.
MBNR: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీపాదరావు ప్రజాస్వామ్య పరిరక్షణకు, శాసన వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేసిన విశిష్ట నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఎపిడెమిక్ బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. జాతరకు తరలివచ్చిన భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య బృందం సూచించారు.
WNP: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే కీలక నిర్ణయాన్ని ఆమోదం తెలిపినట్లు వనపర్తి మహిళా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి తెలిపారు. ప్రస్తుతం 50% రాయితీ ఇస్తున్న ఈ సదుపాయం ఇకపై ఉచితంగా లభించనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న బస్సు సర్వీసులో దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం అనుమతి ఇస్తారన్నారు.
WGL: నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన తొమ్మిదవ వార్డ్ సభ్యుడు బుజ్జి బిచ్య నాయక్ సోమవారం TPCC సభ్యులు రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ ఛైర్మన్ హరీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరినట్లు బిచ్య నాయక్ వెల్లడించారు. అనంతరం రంజిత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
BHNG: ఎంపీ చామల కిరణ్ కుమార్ను గచ్చిబౌలిలో పోచంపల్లి మున్సిపల్ ఛైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని చామల వారికి సూచించారు.
SDPT: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయని సిద్దిపేట డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. బొప్పాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ సాయంతో నేరగాళ్లను త్వరగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు.
WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు బాలామృతం, గుడ్లు సోమవారం పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి. ఆమె మాట్లాడుతూ.. పిల్లలను ప్రతిరోజూ అంగన్వాడికి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆశా వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా గాజుల లింగన్న గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జన్నారంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా లింగన్న గౌడ్, జాడి వెంకట్లను ఎన్నుకున్నారు. ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్న చిలువేరు నరసయ్యను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.