MHBD: గూడూరు మండలం ఏపూర్ గ్రామంలో ఆదివారం ముగ్గురు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు రూ.1.16 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.