JGL: రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్లో బతుకమ్మ వేడుకల వేళ ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసుకున్న ఘటనలో బోదాసు సతీష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.