JGL: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎన్నికల ఆచరణ నియమావళి అమలులో ఉన్నందున ప్రజల వినతులను స్వీకరించే ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.