RR: కేశంపేటలో మొక్కజొన్న పంటను కోసి రోడ్లపై ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి రైతులు కల్లాల్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న ఒక్కసారిగా కొట్టుకుపోయిందని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని అధికారులను రైతుల కోరుతున్నారు.