• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సివిల్ సప్లై అధికారుల దాడులు.. 31 సిలిండర్ల స్వాధీనం

KMR: గాంధారి, రాజంపేట, బాన్సువాడ మండల కేంద్రాల్లో ఆదివారం సివిల్ సప్లై అధికారులు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలపై దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు ఉపయోగించే 31 ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై అధికారి కిష్టయ్య తెలిపారు.గృహ వినియోగ సిలిండర్లను వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

March 15, 2026 / 07:32 PM IST

‘స్కిల్ డెవలప్మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం’

KNR: స్కిల్ డెవలప్మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలంగాణ విఠల్ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూర అశోక్ అన్నారు. కరీంనగర్ ఫిలిమ్ భవన్‌లో డా. బీఎన్. రావు అధ్యక్షతన ‘ఉద్యోగ సమస్య – పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులు అధికంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వనరులకోసం పరిపాలన జరుగుతుంది.

March 15, 2026 / 07:31 PM IST

పారిశుధ్య కార్మికులకు సన్మానం

KNR: కేశవపట్నం గ్రామంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే. ప్రభాకర్ పాల్గొని కార్మికుల సేవలను ప్రశంసించారు. అనంతరం డా. గొట్టే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.

March 15, 2026 / 07:30 PM IST

దోపిడీకి పాల్పడిన నిందితులపై కేసు నమోదు: CI

ADB: దోపిడీకి పాల్పడిన ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగరాజు ఆదివారం తెలిపారు. ఈ మేరకు పట్టణానికి చెందిన నిందితులు దండేవర్ అనికేష్, పిలివర్ రాజేష్ నుంచి సెల్‌ఫోన్, రూ. 1,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రౌడీయిజం చేస్తూ, దోపిడీలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

March 15, 2026 / 07:30 PM IST

పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి: ఎస్పీ

MDK: పిల్లలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వారిపై నిఘా ఉంచాలని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. పిల్లలకు నీటి లోతు తెలియకపోవడం వల్ల జారి నీటిలో పడిపోయే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

March 15, 2026 / 07:29 PM IST

అనారోగ్య సమస్యలతో మనస్థాపానికి గురై మహిళ ఆత్మహత్య

WNP: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. న్యూ టౌన్ కాలనీకి చెందిన రాకాసి శ్రీదేవి(45), మృతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆదివారం ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇట్టి విషయంపై బాధితురాలు తల్లి బాలేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై శశిధర్ కేసు నమోదు చేశారు.

March 15, 2026 / 07:28 PM IST

పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి: MLA

SRPT: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి అండగా ఉందని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ నియోజక వర్గం పరిధిలోని 277 మంది లబ్దిదారులకు రూ. 2 కోట్ల 77 లక్షల విలువగల కల్యాణ లక్ష్మీ & షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 15, 2026 / 07:26 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

NLG: వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై యాదాద్రి జిల్లా అరూరు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 07:25 PM IST

వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

RR: ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. స్వామి కళ్యాణ మహోత్సవంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

March 15, 2026 / 07:20 PM IST

జనగణన శిక్షణ ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్

KMM: ఖమ్మం కలెక్టరేట్లో ఆదివారం జనగణన-2027కు సంబంధించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని జనగణనను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మొదటి దశ ఇళ్ల జాబితా మే 11 నుంచి జూన్ 9 వరకు, రెండో దశ జనగణన ఫిబ్రవరి 2027లో జరుగుతుందని తెలిపారు.

March 15, 2026 / 07:18 PM IST

రంజాన్ ఈద్.. ముస్లిం పేదలకు తోఫాల పంపిణీ

NZB: నందిపేట్‌లోని మస్జిద్ మౌజా వద్ద రంజాన్ ఈద్ పురస్కరించుకొని నందిపేట్ ఎన్టీఆర్ కాలనీ, బజార్ కొత్తూర్ గ్రామాల పేద ముస్లిం కుటుంబాలకు తోఫాల పంపిణీని చేపట్టారు. బజార్ కొత్తూర్ సర్పంచ్ గోపుముత్యం, నందిపేట్ వార్డు సభ్యుడు పాషా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ జమీల్ పాల్గొని లబ్ధిదారులకు తోఫాలను అందజేశారు.

March 15, 2026 / 07:16 PM IST

ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని MLAకు వినతి

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తల గురించి పొందుపరిచిన రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా కార్యకర్తలు కోరారు. ఈ మేరకు ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వినతిపత్రం అందజేశారు. మార్చి 16 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో చర్చించి ఆశా కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

March 15, 2026 / 07:15 PM IST

ఎన్నికల హామీలు అమలు చేయాలి: హరీశ్ రావు

HYD: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు.  స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 15, 2026 / 07:07 PM IST

‘ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు దృష్టి సారించాలి’

KNR: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. కరీంనగర్‌కు విచ్చేసిన ఆయనకు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయపాల్ రెడ్డి, స్వాగతం పలికారు.

March 15, 2026 / 07:07 PM IST

‘బహుజన సమాజం కోసం ఏకం కావాలి’

ADB: బహుజన రాజ్య స్థాపన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకం కావాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లాధ్యక్షుడు గణేష్ మహారాజ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాన్యశ్రీ కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలను పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఎస్పీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

March 15, 2026 / 07:06 PM IST