ADB: బహుజన రాజ్య స్థాపన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకం కావాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లాధ్యక్షుడు గణేష్ మహారాజ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాన్యశ్రీ కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలను పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఎస్పీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.