• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం’

ADB: గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నార్నూర్ మండలం తడిహత్నూర్ గ్రామంలో దాల్, మిల్లెట్ ఫ్లోర్ మిల్ యూనిట్‌ను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. సంపూర్ణ అభియాన్ 2.0లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇటువంటి యూనిట్ల వల్ల స్థానికంగా ఉపాధి పెరిగి మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారని కలెక్టర్ ఆకాంక్షించారు.

March 19, 2026 / 10:06 AM IST

ముస్లింలకు ఈద్గా తోఫా పంపిణీ

KNR: సైదాపూర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో గురువారం ముస్లింలకు ఈద్గా తోఫా కానుకలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య, సర్పంచ్ బత్తుల మౌనిక పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 19, 2026 / 10:05 AM IST

రేపు చెర్వుగట్టులో వేలంపాట

NLG: చెర్వుగట్టులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 2026-27 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో హెచ్-1, ఎల్-1 వేలం నిర్వహించనున్నట్లు EO ఎస్.మోహన్ బాబు తెలిపారు. ఈ నెల 20న తలనీలాలు సేకరించుకునే హక్కు, కిరాణా సామాగ్రి విక్రయం, షాపుల కిరాయి, కూరగాయలు, వాటర్ మోటార్ల రిపేరు, బ్రహ్మోత్సవాల అలంకరణ పనుల హక్కుల కోసం వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

March 19, 2026 / 10:02 AM IST

’19వ వార్డులో మంచినీటి సమస్యను పరిష్కరించండి’

వనపర్తి జిల్లా లోని 19వ వార్డులో గత వారం రోజులుగా మంచినీటి సమస్య నెలకొందని వెంటనే పరిష్కారం చూపాలని కౌన్సిలర్ మురళి సాగర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఉగాది, రంజాన్ పండుగలు ఏకకాలంలో రావడం వల్ల మంచినీటి వాడకం అధికంగా ఉంటుందని దానిని దృష్టిలో ఉంచుకుని లీకేజీలు, నిరంతరం మంచినీటి పంపిణీని చేపట్టాలని వినతిపత్రం అందజేశారు.

March 19, 2026 / 10:01 AM IST

ఉగాది వేళ మన్యంకొండకు భక్తుల రద్దీ

MBNR: నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మన్యంకొండ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

March 19, 2026 / 10:00 AM IST

‘కలెక్టరేట్ వద్ద ధర్నా విజయవంతం చేయండి’

SRD : శివ్వంపేట మండలం దొంతి గ్రామం ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళలో నివసిస్తున్న వారి సమస్యలను సీపీఎం ప్రతినిధి బృందం తెలుసుకుంది. నివాసితులకు పట్టాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, మురుగు కాలువలు నిర్మించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. మార్చి 24న కలెక్టర్ ముందు ధర్నాకు రావాలన్నారు.

March 19, 2026 / 10:00 AM IST

కాళేశ్వరం నీటితో రైతన్నల హర్షం

MDK: కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రామాయంపేట మండలం డి. ధర్మారం గ్రామానికి చేరుకోవడంతో కెనాల్ కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. దీనిపై గ్రామ సర్పంచ్ బండారు శ్రీనివాస్ గౌడ్, మహేందర్ గౌడ్, వార్డు సభ్యులు, వ్యవసాయదారులు హర్షం వ్యక్తం చేశారు. సాగునీరు పుష్కలంగా అందడంతో వరి పంటలు బాగా పండుతాయని ధీమా వ్యక్తం చేస్తూ, నీటిని విడుదల చేసిన ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

March 19, 2026 / 09:56 AM IST

ఈనెల 20న జిల్లా మహాసభలు

NZB: అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా నాయకుడు సీహెచ్. రమేష్ పిలుపునిచ్చారు. సాలూరలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎన్.ఆర్ భవన్లో ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

March 19, 2026 / 09:56 AM IST

మోత్కూర్‌లో దేవతలకు పట్టు వస్త్రాలు

BHNG: మోత్కూర్‌లో ఉగాది సందర్భంగా గ్రామ దేవతలకు పట్టు వస్త్రాల అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఛైర్‌పర్సన్ గడ్డం సప్న, వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న ఆధ్వర్యంలో బొడ్రాయి వద్ద డప్పు చప్పులతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సతీష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉగాది పండుగను స్థానికులు ఘనంగా జరుపుకున్నారు.

March 19, 2026 / 09:55 AM IST

వినియోగదారుల హక్కుల కరపత్రం ఆవిష్కరణ

NLG: చండూరులో జాగృతి వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై కరపత్రికను ఆర్డీవో వీ.శ్రీదేవి ఆవిష్కరించారు. ప్రతి వ్యక్తి జననం నుంచి వినియోగదారుడేనని ఆమె తెలిపారు. వస్తువులు, సేవలు వినియోగించే వారందరికీ హక్కులు వర్తిస్తాయని చెప్పారు. పోటీ ప్రపంచంలో అవగాహన అవసరమని సూచించారు.

March 19, 2026 / 09:52 AM IST

ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్

KMM: న్యాయ సేవల అథారిటీ జిల్లా ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, అత్యధిక కేసులను పరిష్కరించడంతో పాటు తక్షణ న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కోర్టు ఆవరణలో బుధవారం న్యాయమూర్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

March 19, 2026 / 09:52 AM IST

రూ. 179 లక్షలతో బీటీ రోడ్డు అభివృద్ధి పనులు

SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామం మీదుగా బీటి రోడ్డు నిర్మాణం పనులకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ రోడ్డు అభివృద్ధికి 2024-25 CRR నిధులు రూ. 179 లక్షలు మంజూరయ్యాయి. దీంతో సుల్తానాబాద్ PWD రోడ్డు నుంచి గోసాయిపల్లి మీదుగా పోచాపూర్ క్రాసింగ్ పీఆర్ రోడ్ వరకు రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు. త్వరగా BT రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

March 19, 2026 / 09:52 AM IST

రంగనాథ స్వామి దేవాలయంలో చండీహోమం

WGL: గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ పరిధిలోని కాశీబుగ్గలోని రంగనాథ స్వామి దేవాలయంలో ఇవాళ చండీహోమాన్ని నిర్వహించారు. అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక మహిళలు, దంపతులు కార్యక్రమంలో పాల్గొని హోమం చేశారు. దేవాలయం మాజీ అధ్యక్షులు వంగరి రవి, కమిటీ సభ్యులు, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, తదితరులున్నారు.

March 19, 2026 / 09:48 AM IST

నేటి నుంచి మార్కెట్ యార్డ్ బంద్..!

JN: పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నేటి నుంచి ఈనెల 22వ తేదీ వరకు మూసి వేయనున్నట్లు యార్డు ఛైర్మన్ శివరాజ్ యాదవ్ తెలిపారు. ఉగాది, రంజాన్, వారంతపు సెలవుల కారణంగా నాలుగు రోజులపాటు మార్కెట్ బంద్ కానున్నట్లు ఆయన వెల్లడించారు. మళ్లీ ఈనెల 23వ తేదీన మార్కెట్ పున: ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.

March 19, 2026 / 09:45 AM IST

ఉగాది వేళ మటన్ కోసం జనాల రద్దీ

మోత్కూర్, ఆత్మకూర్, గుండాల, అడ్డగూడూరులో ఉగాది పండుగ సందర్భంగా మాంసం దుకాణాల ముందు రద్దీ నెలకొంది. మెయిన్ రోడ్డులో మటన్ కొనేందుకు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం సంతరించుకుంది. రోడ్డుకి ఇరువైపులా జనాలు నిండిపోవడంతో రద్దీగా మారింది. కిలో మటన్ రూ.800 ఉందని వినియోగదారులు చెబుతున్నారు.

March 19, 2026 / 09:45 AM IST