MDK: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగగానే రైల్వే కూలీలు ఆయనను కలిసి ఉత్సాహంగా గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి వారితో సరదాగా ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీల సంక్షేమానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
MLG: మేడారం జంపన్నవాగులో నిత్యం నీరు ప్రవహించేలా గోదావరి జలాలను తరలిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మూడు ఫీట్ల ఎత్తులో నీటిమట్టం ఉండేలా 5 చెక్ డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే పనులు మొదలు పెడతామన్నారు. మేడారాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
MDCL: మేడ్చల్, కిష్టాపూర్ ప్రాంతాల వైపు రియల్ ఎస్టేట్ విపరీతంగా విస్తరిస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. మేడ్చల్, షామీర్పేట మార్గాల వైపు మెట్రో నిర్మాణంపై DPR సిద్ధం కావడం, మరోవైపు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉత్తర భాగం వైపు సైతం ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
VKB: మోమిన్పేట్ మండలం వెల్చల్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని అలంకరించిన రథంపై పురవీధుల్లో ఊరేగించగా, భక్తులు భక్తిపారవశ్యంతో పూజలు నిర్వహించారు. సర్పంచ్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
పెద్దపల్లి: రామగుండం-3 జీఎం కార్యాలయంలో బాయ్స్ టెండర్లను 19 మందికి బదులుగా 12మందికి పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) ప్రతినిధులు శనివారం మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. 19 మందికి టెండర్ అమలు చేయాలని సింగరేణి జీఎంను ఆదేశించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్మికులు ఉన్నారు.
HNK: విజ్ఞాన శాస్త్రమే దేశ అభివృద్ధికి పునాది అని, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే నేషనల్ సైన్స్ డే ప్రధాన ఉద్దేశమని WGL MP డా. కడియం కావ్య అన్నారు. శనివారం సాయంత్రం HNK జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ డే వేడుకల్లో MP పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం WGLను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు.
JGL: ప్రభుత్వం 4 రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతులతో అనేక విషయాలు తెలుసుకున్నట్లు పెగడపల్లి మండల సర్పంచులు పేర్కొన్నారు. మల్యాల మండలం నూకపల్లి న్యాక్ సెంటర్లో మండలానికి చెందిన సర్పంచులకు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం సాయంత్రంతో ముగిశాయి. సర్పంచులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పాలన అధికారాలు, విధులు, తెలుసుకున్నామన్నారు.
RR: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డులలో ఏర్పాటు చేసిన ఐమాక్స్ (హై మాస్ట్) లైట్లను నిన్న రాత్రి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ఈ లైట్లను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పత్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.
GDWL: ఏప్రిల్ 14 నాటికి సంపూర్ణత అభియాన్లోని 6 ముఖ్య ఇండికేటర్ల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని గట్టు తహసీల్దార్ విజయ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు గట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చెన్నయ్య అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ద్వారానే వంద శాతం ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు (ఆదివారం) నల్లగొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 నుంచి 10:00 వరకు నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం 10 గంటలకు రాములబండ గ్రామానికి చేరుకుని బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి, వివిధ కార్యక్రమాల అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.
ADB: నార్నూర్ మండలం ఎంపల్లి గ్రామం ఘాట్ రోడ్ ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. ఎక్కువ మలుపులు ఉన్న ఈ రోడ్డుపై ఎక్కడా దిశా సూచిక బోర్డులు లేవు. రాత్రి వేళల్లో వాహనదారులు చీకటిలో దారి తెలియక భయంతో ప్రయాణిస్తున్నారు. పక్క గోడలు లేకపోవడంతో చిన్న తప్పిదమే పెద్ద ప్రమాదానికి దారి తీసే పరిస్థితి ఉంది.
NZB: జిల్లాలో పీఎం శ్రీనిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, NZB కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులను కర్యక్రమాలను పరిశీలించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పీఎం శ్రీ నిధులు మంజూరు పై సమీక్షించారు
HYD: పాతబస్తీలోని మురుగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కొత్త రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీ-సిల్టింగ్ పనులను జలమండలి MD అశోక్ రెడ్డి, హైడ్రాకమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవర్ లైన్లలో ఏర్పడిన పూడికను తొలగించడానికి ఉపయోగపడుతుందన్నారు.
PDPL: గోదావరిఖని పట్టణం 8వ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం భాగ్యలక్ష్మి-తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో BRS పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. MLA- MS రాజ్ ఠాకూర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నాయకులు బొంతల రాజేష్, గుండేటి రాజేష్, పాల్గొన్నారు.
KMM: మధిరలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. కార్యాలయ భవన మరమ్మతులు సౌకర్యాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.