MDK: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగగానే రైల్వే కూలీలు ఆయనను కలిసి ఉత్సాహంగా గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి వారితో సరదాగా ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీల సంక్షేమానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.