ADB: నార్నూర్ మండలం ఎంపల్లి గ్రామం ఘాట్ రోడ్ ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. ఎక్కువ మలుపులు ఉన్న ఈ రోడ్డుపై ఎక్కడా దిశా సూచిక బోర్డులు లేవు. రాత్రి వేళల్లో వాహనదారులు చీకటిలో దారి తెలియక భయంతో ప్రయాణిస్తున్నారు. పక్క గోడలు లేకపోవడంతో చిన్న తప్పిదమే పెద్ద ప్రమాదానికి దారి తీసే పరిస్థితి ఉంది.