GNTR: మంత్రి లోకేష్ సోమవారం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం మహానాడులో రిటైనింగ్ వాల్ శంకుస్థాపన, నులకపేటలో కమ్యూనిటీ హాల్, పెదవడ్లపూడిలో హైలెవల్ ఛానెల్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పెనుమూలిలో లైబ్రరీ, దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ను ప్రారంభించి, సాయంత్రం 3 గంటలకు రేవేంద్రపాడులో NTR విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.