MBNR: హన్వాడ మండలం దొర్రితండా పాఠశాల 5వ తరగతి విద్యార్థి నిదీష్, ఏపీలోని ప్రతిష్ఠాత్మక కొరుకొండ సైనిక్ పాఠశాలకు ఎంపికయ్యాడు. ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన నిదీష్ విజయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు హర్షంతో స్వాగతించారు. ఆయన విజయం తండాలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.