KNR: సైదాపూర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో గురువారం ముస్లింలకు ఈద్గా తోఫా కానుకలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య, సర్పంచ్ బత్తుల మౌనిక పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.