MDK: రామాయంపేట మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్గా గణేష్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన కమిషనర్ శ్రావణ్ సెలవుపై వెళ్లగా, తూప్రాన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న గణేష్ రెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన సేవలు అందిస్తామని గణేష్ రెడ్డి తెలిపారు.