నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల్లో జరిగిన ఆక్రమణలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు శుక్రవారం తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఫ్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న అధికారులు ప్రదేశానికి చేరుకుని మొరం తొలగించి ఆక్రమణలను క్లియర్ చేశారు.