BHPL: భూపాలపల్లి జిల్లాలో రైతుల సాగు భూముల వివరాలు డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం వాలంటీర్లను నియమిస్తోంది. రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున 12 మండలాల్లో 186 మందిని నియమించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) బాబురావు తెలిపారు. భవిష్యత్తులో పంటల నమోదు డిజిటల్ విధానంలో జరుగుతుందని DAO బాబురావు వెల్లడించారు