BHPL: కాటారం మండల కేంద్రంలోని జగ్గయ్యపల్లె గ్రామ శివారులోని వాగులో ఇటీవల లభించిన 12వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి శిలా విగ్రహాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గ్రామంలోకి తరలించారు. ఈ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగనుందని గ్రామపెద్దలు, ఆలయ అర్చకులు తెలిపారు.