SRCL: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్’లో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ క్రీడా వేడుకల్లో మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి ఆయన క్రీడాస్ఫూర్తిని చాటారు. ముఖ్యంగా టగ్ ఆఫ్ వార్, కబడ్డీ పోటీల్లో పాల్గొని అందరిని అలరించారు.