MDCL: ఉప్పల్ పరిసరాల్లో కాలువ పనులు కొనసాగుతుండటంతో ఆంజనేయ నగర్, శ్రీనగర్, సెవెన్ హిల్స్ కాలనీ ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా మారింది. తవ్విన కాలువల్లో నిల్వ నీరు ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వేళ బయటికి రావడానికే భయపడుతున్నామని వాపోతున్నారు. వెంటనే ఫాగింగ్, శుభ్రత చర్యలు చేపట్టాలన్నారు.