NLG: అక్రమ శిశు విక్రయాలపై ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాలతో త్రిపురారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్ఐ నరేష్ వర్మ నేతృత్వంలో 24 గంటల్లోనే కేసును ఛేదించి, పసికందును సురక్షితంగా రక్షించారు. నిందితులను అదుపులోకి తీసుకుని, శిశువును నల్లగొండ సంక్షేమ కేంద్రానికి తరలించారు. సత్వరమే స్పందించిన పోలీసులకు పలువురు అభినందనలు తెలిపారు.