RR: చంద్రగ్రహణం కారణంగా రేపు కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేసి గ్రహణం వీడిన అనంతరం 4వ తేదీ ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు, అభిషేకం, అలంకరణ తర్వాత యథావిధిగా భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.