MDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ ఐడీఓసీ (IDOC) లోని పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణను సమీక్షించి, పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.