PDPL: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలవడం పట్ల కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ప్రజల విజయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వంలో ఇది ప్రజల విజయమని తెలిపారు.