HYD: డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కార్డులను పెంచాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో HYDలోని గన్ పార్క్ నుంచి నాంపల్లి చాపల్ రోడ్డులోని మీడియా అకాడమీ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అకాడమీ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. TWJF వ్యవస్థాపక అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ.. అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.