ADB: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వాహనదారులను పోలీసులు అభినందించారు. బోథ్ ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను, సీట్ బెల్ట్ ధరించిన కారు డ్రైవర్లను ఆపి వారికి పువ్వులు అందజేసి ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.