SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని ఇవాళ ప్రత్యేకంగా అలంకరించి, పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు అర్చకులు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, గోత్రనామాలతో పూజలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని కమిటీ సభ్యులు తెలిపారు.