SRD: తన జన్మదినం పురస్కరించుకొని కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.