ATP: వజ్రకరూరు మండలంలోని అంగన్వాడి కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మోనాలిసా మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అంగన్వాడి సెంటర్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. సర్పంచ్ మోనాలిసా టీచర్గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. స్వయంగా ఆమె విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి తినిపించారు.