GDWL: మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజి వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రవల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఆత్మకూరులో బంధువుల వివాహానికి హాజరై తిరిగి గద్వాలకు వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.