NLG: చెర్వుగట్టులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 2026-27 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో హెచ్-1, ఎల్-1 వేలం నిర్వహించనున్నట్లు EO ఎస్.మోహన్ బాబు తెలిపారు. ఈ నెల 20న తలనీలాలు సేకరించుకునే హక్కు, కిరాణా సామాగ్రి విక్రయం, షాపుల కిరాయి, కూరగాయలు, వాటర్ మోటార్ల రిపేరు, బ్రహ్మోత్సవాల అలంకరణ పనుల హక్కుల కోసం వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.