గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని మహాకవి తిక్కన ఎస్పీకేహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించగా.. పాఠశాలలో నమోదైన 136 మంది విద్యార్థులకు సరుకులు తీసుకున్నప్పటికీ, కేవలం 30 మందికే సరిపడా భోజనం తయారు చేసినట్లుగా గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.